లాక్డౌన్పై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్
- March 26, 2021హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధిస్తారని కొన్ని రోజులుగా ప్రచారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ఇవాళ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ఇక లాక్ డౌన్ ఉండబోదని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.పరిశ్రమల మూసివేత కూడా ఉండబోదని..తొందరపాటు నిర్ణయాలు ఉండవన్నారు సీఎం కేసీఆర్.ప్రజలెవరూ భయపడవద్దని..పెండ్లిల కూడా జనం తగ్గించుకోవాలని సూచించారు.గతేడాది లాక్డౌన్తో ఆర్థికంగా చాలా నష్టపోయామని సీఎం కేసీఆర్ తెలిపారు.సెల్ఫ్ కంట్రోల్... సెల్ఫ్ డిసిప్లిన్ ముఖ్యమని తెలిపారు.కరోనా కారణంగా విద్యాసంస్థలు మూసివేయడం బాధాకరమేనని..స్కూళ్ల మూసివేత తాత్కాలికమన్నారు.కరోనా వ్యాక్సిన్ మన చేతిలో లేదని...మన వాటా మనకు వస్తుందన్నారు.ప్రధాని కూడా కరోనా వ్యాక్సిన్పై స్పష్టతతో ఉన్నారన్నారని తెలిపారు.గతేడాది లాక్డౌన్ కారణంగా సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్న సీఎం.. మాయదారి కరోనా యావత్తు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందన్నారు.తక్కువ మంది అతిధులతో పెళ్లిళ్లు నిర్వహించుకోవాలని సీఎం సూచించారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..