సా.6 గంటల వరకే బస్సు సర్వీసులు..ఎమ్వసలాత్ క్లారిటీ
- March 26, 2021ఒమన్ : కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు నైట్ లాక్డౌన్ విధించనున్నట్లు ఒమన్ సుప్రీం కమిటీ ప్రకటించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా తమ బస్సు, ఫెర్రీస్ సర్వీసుల సమయాలను కూడా కుదిస్తున్నట్లు ఎమ్వసలాత్ స్పష్టం చేసింది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 8 వరకు సాయంత్రం 6 గంటల వరకు తమ సర్వీసులు గమ్యస్థానాలకు చేరుకుంటాయని వెల్లడించింది. అందుకు అనుగుణంగా ఇంటర్ సిటీ బస్సు సర్వీసు సమయాలను రీషెడ్యూల్ చేస్తామని వివరించింది. సిటీ బస్సులు మస్కట్, సలాలాలో సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. రీషెడ్యూల్ చేసిన బస్సు, ఫెర్రీస్ సర్వీసుల సమయాలను పూర్తి వివరాలతో సోషల్ మీడియాలోని తమ అధికారిక ఖాతాల ద్వారా తెలియజేస్తామని ఎమ్వసలాత్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు
- సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల..
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్ప్రెస్ వే మూసివేత