హోలీ వేడుకలకు రాజ్ భవన్ దూరం ఇంటి నుండే వేడుకలు: ఏపీ గవర్నర్
- March 27, 2021
విజయవాడ: కరోనా కేసుల సంఖ్య పెరగుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం విజయవాడ ఎపి రాజ్ భవన్లో హోలీ వేడుకలు నిర్వహించరాదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ నిర్ణయించినట్లు గవర్నర్ వారి కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా తెలిపారు.రాష్ట్ర ప్రజలందరూ ఇంట్లో ఉండి హోలీ పండుగను జరుపుకోవాలని గవర్నర్ హరిచందన్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సామాజిక దూరాన్ని కొనసాగించడం,ముసుగు ధరించడం, శానిటైజర్ లేదా సబ్బు ఉపయోగించి తరచుగా చేతులు కడుక్కోవడం వంటి అంశాలను కొనసాగించటం ద్వారా అప్రమత్తంగా ఉండాలన్నారు.కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితంగా ఉన్నందున అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ టీకాలు వేయుంచు కావాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.ఇది వైరస్ సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయడానికి సహాయ పడుతుందన్నారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







