కాల్పుల్లో 114 మంది ప్రజలు మృతి...
- March 28, 2021
మయన్మార్:మయన్మార్ లో ప్రస్తుతం సైనిక పాలన కొనసాగుతోంది. ఫిబ్రవరి 1 వ తేదీన మయన్మార్ లో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, జనరల్ మింగ్ అంగ్ లయాంగ్ సైనిక తిరుగుబాటు చేసి అధికారం హస్తగతం చేసుకున్నాడు. అప్పటి నుంచి దేశంలో ప్రజలు సైనిక పాలనకు నిరసిస్తూ తిరిగి దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు. ఆందోళనలు చేస్తున్న ఉద్యమకారులపై సైన్యం అణివేత చర్యలు చేపడుతోంది. శనివారం రోజున నిరసనలు చేస్తున్న నిరసనకారులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 114 మంది ప్రజలు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రపంచం మొత్తం షాక్ అయ్యింది. మయన్మార్ సైనికపాలనపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే, ఈ చర్య జరిగిన కొన్ని గంటలకు జనరల్ టీవీ లో ప్రసంగించారు. త్వరలోనే దేశంలో తిరిగి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!







