మండుతున్న ఎండలు

- March 28, 2021 , by Maagulf
మండుతున్న ఎండలు

మార్చి ఆరంభం నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలతో ఈ సమ్మర్ జనాలకు చుక్కలు చూపించనుంది. రెండు రాష్ట్రాల్లో అప్పుడే వడగాలులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. వీటి ప్రభావంలో సాధారణం కంటే 4-6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

రాష్ట్రంలోని మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉండనుంది. అటు, ఏపీలోని విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలతో పాటు వాయవ్య దిశ నుంచి వీస్తున్న గాలులే వడగాలులకు కారణమని అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయంటున్నారు. పగటి పూట అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వెళ్లినా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కువ నీళ్లు తాగుతూ…డిహైడ్రేషన్‌ బారి నుంచి కాపాడుకోవాలని చెబుతున్నారు. దాహం తీర్చుకునేందుకు కూల్ డ్రింక్స్ బదులు కొబ్బరి బొండం, మజ్జిగ తాగడం మంచిదని, మసాలా పదార్థారాలకు వీలైనంత దూరంగా ఉండాలని చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com