తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- February 15, 2026
అబుదాబి: ఖతార్ స్టేట్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని శనివారం అబుదాబిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు హెచ్ హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ప్రధానంగా మిడిలీస్టులోని పరిస్థితిని సమీక్షించారు. సమస్యలను ఎదుర్కొవడానికి సమన్వయంతో పని చేయాలని నిర్ణయించారు. పలు సమస్యలకు దౌత్య పరమైన చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందన్న ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తద్వారా శాంతిని కొనసాగించడానికి మరియు ఈ ప్రాంత ప్రజలకు అభివృద్ధి అవకాశాలను పెంచడానికి దోహదపడే అనేక కార్యక్రమాల్లో సంయుక్తంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారని ఖతార్ అమీర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవల్లో మార్పులు..







