నాలుగు స్కూళ్ళలో క్లాసుల్ని సస్పెండ్ చేసిన హెల్త్ మినిస్ట్రీ
- March 29, 2021
బహ్రెయిన్: అల్ దిరాజ్ బాలుర ప్రైమరీ స్కూల్, ఫాతిమా బింట్ అసద్ ప్రైమరీ బాలికల స్కూల్, అల్ రవాబి ప్రైవేట్ స్కూల్ (ప్రైమరీ), ఐబిఎన్ ఖల్దౌన్ నేషనల్ స్కూల్ (కిండర్గార్టెన్ మరియు ప్రైమరీ స్కూల్) లను 10 రోజులపాటు తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది మినిస్ట్రీ. విద్యార్థులకు వర్చువల్ స్టడీ అందుబాటులో వుంటుందని మినిస్ట్రీ వెల్లడించింది. కొత్తగా ఎలాంటి కరోనా పాజిటివ్ కేసులూ వెలుగు చూడలేదని తేలేదాకా ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు అమల్లో వుంటాయి. ఇప్పటికే వున్న కేసులకు సంబంధించి క్వారంటైన్ పీరియడ్ పాటించడంతోపాటు, వారితో సన్నిహితంగా మెలిగినవారూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. స్కూళ్ళను స్టెరిలైజ్ చేయడంతోపాటు కోవిడ్ 19 ప్రికాషనరీ ప్రోటోకాల్స్ పాటించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









