ప్రయాణీకులు 3,000 దిర్హాముల వరకు విలువ చేసే బహుమతులు తీసుకురావొచ్చు
- March 29, 2021
యూఏఈ: యూఏఈలోకి వచ్చే ప్రయాణీకులు తమ వెంట 3,000 దిర్హాముల వరకు విలువైన బహుమతుల్ని తీసుకొచ్చేందుకు అవకాశం వుందని ఫెడరల్ కస్టమ్స్ అథారిటీ పేర్కొంది. యూఏఈకి వచ్చే ప్రయాణీకులు, యూఏఈ నుంచి వెళ్ళే ప్రయాణీకులు తప్పనిసరిగా జీసీసీ యూనిఫైడ్ కస్టమ్స్ చట్టాల్ని గౌరవించాలని అథారిటీస్ సూచిస్తున్నాయి. అరబిక్, ఇంగ్లీషు మరియు ఉర్దూ భాషల్లో ఈ మేరకు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. మూవీ ప్రొజెక్షన్ డివైజ్లు, టీవీ మరియు రిసీవర్, డిజిటల్ కెమెరాలు, సీడీ ప్లేయర్లు, పోర్టబుల్ కంప్యూటర్లు అలాగే ప్రింటర్లు, వ్యక్తిగత వినియోగం నిమిత్తం తెచ్చుకునే మందులు వంటి వాటికి సంబంధించి నిబంధనల మేర అనుమతి వుంటుంది. ఎట్టి పరిస్థుతుల్లోనూ బహుమతుల విలువ 3,000 దిర్హాములు దాటకూడదు. సిగరెట్ల విషయానికొస్తే, 200 కంటే ఎక్కువ తీసుకురాకూడదు. 18 ఏళ్ళ లోపు వయసువారు పొగాకు ఉత్పత్తులు, మద్యం తీసుకురాకూడదు. నగదు విషయాన్ని ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలి. విలువైన లోహాలు, రాళ్ళ విలువ 60,000 దిర్హాముల కంటే ఎక్కువ వుంటే ఆ వివరాల్ని పొందుపర్చాలి.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









