ప్రయాణీకులు 3,000 దిర్హాముల వరకు విలువ చేసే బహుమతులు తీసుకురావొచ్చు
- March 29, 2021
యూఏఈ: యూఏఈలోకి వచ్చే ప్రయాణీకులు తమ వెంట 3,000 దిర్హాముల వరకు విలువైన బహుమతుల్ని తీసుకొచ్చేందుకు అవకాశం వుందని ఫెడరల్ కస్టమ్స్ అథారిటీ పేర్కొంది. యూఏఈకి వచ్చే ప్రయాణీకులు, యూఏఈ నుంచి వెళ్ళే ప్రయాణీకులు తప్పనిసరిగా జీసీసీ యూనిఫైడ్ కస్టమ్స్ చట్టాల్ని గౌరవించాలని అథారిటీస్ సూచిస్తున్నాయి. అరబిక్, ఇంగ్లీషు మరియు ఉర్దూ భాషల్లో ఈ మేరకు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. మూవీ ప్రొజెక్షన్ డివైజ్లు, టీవీ మరియు రిసీవర్, డిజిటల్ కెమెరాలు, సీడీ ప్లేయర్లు, పోర్టబుల్ కంప్యూటర్లు అలాగే ప్రింటర్లు, వ్యక్తిగత వినియోగం నిమిత్తం తెచ్చుకునే మందులు వంటి వాటికి సంబంధించి నిబంధనల మేర అనుమతి వుంటుంది. ఎట్టి పరిస్థుతుల్లోనూ బహుమతుల విలువ 3,000 దిర్హాములు దాటకూడదు. సిగరెట్ల విషయానికొస్తే, 200 కంటే ఎక్కువ తీసుకురాకూడదు. 18 ఏళ్ళ లోపు వయసువారు పొగాకు ఉత్పత్తులు, మద్యం తీసుకురాకూడదు. నగదు విషయాన్ని ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలి. విలువైన లోహాలు, రాళ్ళ విలువ 60,000 దిర్హాముల కంటే ఎక్కువ వుంటే ఆ వివరాల్ని పొందుపర్చాలి.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి
- బ్లాక్ సిలో నౌక పై దాడి..భారతీయుడు దుర్మరణం
- విద్యార్థుల కేసు విచారణపై స్పష్టత ఇచ్చిన సీజేఐ సూర్యకాంత్!
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక







