ప్రయాణీకులు 3,000 దిర్హాముల వరకు విలువ చేసే బహుమతులు తీసుకురావొచ్చు
- March 29, 2021
యూఏఈ: యూఏఈలోకి వచ్చే ప్రయాణీకులు తమ వెంట 3,000 దిర్హాముల వరకు విలువైన బహుమతుల్ని తీసుకొచ్చేందుకు అవకాశం వుందని ఫెడరల్ కస్టమ్స్ అథారిటీ పేర్కొంది. యూఏఈకి వచ్చే ప్రయాణీకులు, యూఏఈ నుంచి వెళ్ళే ప్రయాణీకులు తప్పనిసరిగా జీసీసీ యూనిఫైడ్ కస్టమ్స్ చట్టాల్ని గౌరవించాలని అథారిటీస్ సూచిస్తున్నాయి. అరబిక్, ఇంగ్లీషు మరియు ఉర్దూ భాషల్లో ఈ మేరకు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. మూవీ ప్రొజెక్షన్ డివైజ్లు, టీవీ మరియు రిసీవర్, డిజిటల్ కెమెరాలు, సీడీ ప్లేయర్లు, పోర్టబుల్ కంప్యూటర్లు అలాగే ప్రింటర్లు, వ్యక్తిగత వినియోగం నిమిత్తం తెచ్చుకునే మందులు వంటి వాటికి సంబంధించి నిబంధనల మేర అనుమతి వుంటుంది. ఎట్టి పరిస్థుతుల్లోనూ బహుమతుల విలువ 3,000 దిర్హాములు దాటకూడదు. సిగరెట్ల విషయానికొస్తే, 200 కంటే ఎక్కువ తీసుకురాకూడదు. 18 ఏళ్ళ లోపు వయసువారు పొగాకు ఉత్పత్తులు, మద్యం తీసుకురాకూడదు. నగదు విషయాన్ని ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలి. విలువైన లోహాలు, రాళ్ళ విలువ 60,000 దిర్హాముల కంటే ఎక్కువ వుంటే ఆ వివరాల్ని పొందుపర్చాలి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









