రమదాన్: 25 శాతం ప్రభుత్వ సిబ్బందికి రిమోట్ విధానంలో విధులు

- March 30, 2021 , by Maagulf
రమదాన్: 25 శాతం ప్రభుత్వ సిబ్బందికి రిమోట్ విధానంలో విధులు

సౌదీ:మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మెంట్ అహ్మద్ అల్ రాజి, రమదాన్ నేపథ్యంలో ప్రభుత్వ సిబ్బంది విధులకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో ఉపవాస దీక్షలు చేసే ఉద్యోగుల కోసం మొత్తం సిబ్బందిలో 25 శాతానికి మించకుండా రిమోట్ విధానం ద్వారా పనిచేసేందుకు వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఉద్యోగులు మూడు గ్రూపులుగా విభజించబడతారు. ప్రతి గ్రూపునకూ మధ్య గంట విరామం వుండేలా తమ విధుల్ని ఆయా సిబ్బంది నిర్వహిస్తారు. అటెండెన్స్ రిజిస్టర్ కోసం నిర్దేశించబడిన ఫింగర్ ప్రింటింగ్ విధానం సస్పెండ్ అవుతుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పని సమయం వుంటుంది ఉద్యోగులకు. కరోనా వైరస్ నేపథ్యంలో విధిగా ముందు జాగ్రత్త చర్యలు పాటించాలి. కరోనా వైరస్ నేపథ్యంలో తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యేవారికి రిమోట్ వర్కింగ్ విధానంలో ప్రాధాన్యత కల్పిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com