రమదాన్: 25 శాతం ప్రభుత్వ సిబ్బందికి రిమోట్ విధానంలో విధులు
- March 30, 2021
సౌదీ:మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మెంట్ అహ్మద్ అల్ రాజి, రమదాన్ నేపథ్యంలో ప్రభుత్వ సిబ్బంది విధులకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో ఉపవాస దీక్షలు చేసే ఉద్యోగుల కోసం మొత్తం సిబ్బందిలో 25 శాతానికి మించకుండా రిమోట్ విధానం ద్వారా పనిచేసేందుకు వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఉద్యోగులు మూడు గ్రూపులుగా విభజించబడతారు. ప్రతి గ్రూపునకూ మధ్య గంట విరామం వుండేలా తమ విధుల్ని ఆయా సిబ్బంది నిర్వహిస్తారు. అటెండెన్స్ రిజిస్టర్ కోసం నిర్దేశించబడిన ఫింగర్ ప్రింటింగ్ విధానం సస్పెండ్ అవుతుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పని సమయం వుంటుంది ఉద్యోగులకు. కరోనా వైరస్ నేపథ్యంలో విధిగా ముందు జాగ్రత్త చర్యలు పాటించాలి. కరోనా వైరస్ నేపథ్యంలో తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యేవారికి రిమోట్ వర్కింగ్ విధానంలో ప్రాధాన్యత కల్పిస్తారు.
తాజా వార్తలు
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు
- పవర్ఫుల్ పాస్పోర్టుల జాబితా విడుదల
- మార్చి 1 నుంచి లైసెన్స్ లేనివారి పై కఠిన చర్యలు
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డిల సేవలు చిరస్మరణీయం: మంత్రి దుర్గేష్
- గల్ఫ్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్
- కమ్యూనిటీ పోలీసింగ్’ ద్వారా ప్రజలతో మమేకం: సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేష్
- కటారాలో ఖతార్ హలాల్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విలువ $140 బిలియన్లు..!!
- దుబాయ్ లో వర్క్, బిజినెస్ వల్లే 90% ట్రాఫిక్ రద్దీ..!!









