ఫేస్ మాస్క్ ఉల్లంఘనలు 63,842
- March 30, 2021బహ్రెయిన్: మార్చి 25 వరకు రికార్డు స్థాయిలో ఫేస్ మాస్క్ ఉల్లంఘలు నమోదయ్యాయి. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ ధరించాలని అథారిటీస్ సూచిస్తున్నాయి. పౌరులు, నివాసితులు ఫేస్ మాస్కు ధరించడం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. కరోనా బాధిత వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఆరడుగుల దూరం వరకు వైరస్ విస్తరించే అవకాశం వుంటుంది. ఇతరుల ముక్కులు లేదా నోట్లోకి వైరస్ నేరుగా వెళ్ళేందుకు అవకాశాలెక్కువ. ఎక్కువగా లక్షణాలు లేని కరోనా బాధితుల నుంచే ఇతరులకు వేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్కు ధరించడం వల్ల తమను తాము రక్షించుకోవడంతోపాటు, ఇతరులకు కరోనా సోకకుండా చేయగలరని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ