ఆస్పత్రిలో జాయిన్ అయిన సచిన్
- April 02, 2021
ముంబై:భారత మాజీ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరారు. ఇదే విషయాన్ని సచిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రోడ్ సేఫ్టీ ట్రోఫీ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్కు కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యుల సూచనలు, ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఆస్పత్రిలో చేరినట్లు సచిన్ టెండూల్కర్ వెల్లడించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన, తన క్షేమం కోరిన వారందరికీ సచిన్ ధన్యవాదాలు తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఇంటికి తిరిగి వస్తానని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. అందరూ జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని ప్రజలకు సచిన్ టెండూల్కర్ విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా టీమిండియాకు, భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, మార్చి 27వ తేదీన ఆరోగ్యంలో స్వల్ప తేడాలు కనిపించడంతో సచిన్ టెండూల్కర్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఈ టెస్ట్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో.. సచిన్ హోమ్ ఐసోలేషన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు సచిన్.. ఆస్పత్రిలో చేరారు.
తాజా వార్తలు
- మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి
- జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు మృతి
- BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు
- జర్నలిస్టులకు శుభవార్త..9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!
- దుబాయ్లో మరిన్ని చోట్ల పెయిడ్ పార్కింగ్..!!
- హవల్లిలో తనిఖీలు.. 65 నోటీసులు జారీ..!!
- పర్యాటకుల కోసం వ్యాట్ రీఫండ్.. ఒమన్ ప్లాన్..!!
- నకిలీ బంగారం విక్రయం.. అనుమానితుడు అరెస్ట్..!!









