ఉద్యోగి భార్యకు వేతనం చెల్లించిన ఏరీస్ సంస్థ
- April 02, 2021
షార్జా: దీపా ప్రభిరాజ్ అనే ఓ మహిళ మార్చి 28న ఏరీస్ గ్రూప్ నుంచి వేతనం అందుకున్నారు. ఆమె ఆ సంస్థ కోసం ప్రత్యక్షంగా ఎలాంటి సేవలూ అందించలేదు. కానీ, ఆమె భర్త మాత్రం ఆ సంస్థలో పనిచేస్తున్నారు. ఆయన పేరు ప్రభిరాజ్ నటరాజన్. ఏరీస్ సంస్థలో మేనేజింగ్ డైరెక్టరుగా పనిచేస్తున్నారు. ఏరీస్ సంస్థలో పనిచేస్తున్నవారి భార్యల పేర్లను నెలవారీ వేతనాల లిస్టులో ఇటీవల చేర్చారు. ఈ విషయాన్ని ఈ మధ్యనే సంస్థ ఛైర్మన్ మరియు సీఈఓ సోహన్ రాయ్ వెల్లడించారు. పెళ్ళయ్యాక మూడేళ్ళపాటు కంపెనీతో పనిచేస్తున్నవారికి ఈ ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నారు. 25 శాతం వేతనాన్ని పొందుతారు ఈ కేటగిరీలో.చాలా కంపెనీలు ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, తమ ఉద్యోగుల కస్టంతో తమ కంపెనీ స్థిరమైన ఎదుగుదల ప్రదర్శిస్తోందని సోహన్ రాయ్ వెల్లడించారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







