ఉద్యోగి భార్యకు వేతనం చెల్లించిన ఏరీస్ సంస్థ
- April 02, 2021
షార్జా: దీపా ప్రభిరాజ్ అనే ఓ మహిళ మార్చి 28న ఏరీస్ గ్రూప్ నుంచి వేతనం అందుకున్నారు. ఆమె ఆ సంస్థ కోసం ప్రత్యక్షంగా ఎలాంటి సేవలూ అందించలేదు. కానీ, ఆమె భర్త మాత్రం ఆ సంస్థలో పనిచేస్తున్నారు. ఆయన పేరు ప్రభిరాజ్ నటరాజన్. ఏరీస్ సంస్థలో మేనేజింగ్ డైరెక్టరుగా పనిచేస్తున్నారు. ఏరీస్ సంస్థలో పనిచేస్తున్నవారి భార్యల పేర్లను నెలవారీ వేతనాల లిస్టులో ఇటీవల చేర్చారు. ఈ విషయాన్ని ఈ మధ్యనే సంస్థ ఛైర్మన్ మరియు సీఈఓ సోహన్ రాయ్ వెల్లడించారు. పెళ్ళయ్యాక మూడేళ్ళపాటు కంపెనీతో పనిచేస్తున్నవారికి ఈ ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నారు. 25 శాతం వేతనాన్ని పొందుతారు ఈ కేటగిరీలో.చాలా కంపెనీలు ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, తమ ఉద్యోగుల కస్టంతో తమ కంపెనీ స్థిరమైన ఎదుగుదల ప్రదర్శిస్తోందని సోహన్ రాయ్ వెల్లడించారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







