అత్యవసర సేవలు మినహా ఆన్ లైన్లోనే వైద్య సేవలు
- April 06, 2021
దోహా:కోవిడ్ తీవ్రత సాధారణ వైద్యసేవలపై ప్రభావం చూపుతోంది. రోజురోజుకీ కోవిడ్ కేసులు పెరిగిపోతుండటంతో వైద్యసేవలకు సంబంధించి ఖతార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇక నుంచి పీహెచ్సీసీలలో సాధారణ వైద్యసేవల కోసం నేరుగా ఆరోగ్య కేంద్రాలకు రావొద్దని ప్రకటించింది. అత్యవసర సేవలు మినహా అన్ని సాధారణ వైద్య సేవలు ఆన్ లైన్లోనే అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. కోవిడ్ తీవ్రత నేపథ్యంలో వైద్య సిబ్బంది, ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నటలు పీహెచ్సీసీ అధికారులు వెల్లడించారు. అదే సమయంలో పీహెచ్సీసీ కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోందని, వ్యాక్సిన్ కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు కూడా ఈ నిర్ణయం దోహదపడుతోందని అభిప్రాయపడింది. అయితే..అత్యవసేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. అలాగే డెంటల్, చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్, అత్యవసరంగా స్కాన్లు, ఎక్స్ రేలు తీయాల్సిన అవసరం ఉన్నా, కోవిడ్ సంబంధిత సేవలకు సంబంధించి నేరుగా వైద్యసేవలు పొందవచ్చు. నేరుగా వైద్య సేవలు పొందేవారు ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఎమర్జేన్సీ పరిస్థితులు తలెత్తితే 1600కి కాల్ చేసి రెండు ఆప్షన్ ఎంచుకోవటం ద్వారా తామ పీహెచ్సీలో వైద్య సేవలను పొందవచ్చు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







