వర్క్ పర్మిట్ వచ్చిన ఏడాదికి కార్మికుల బదిలీకి కువైట్ గ్రీన్ సిగ్నల్
- April 07, 2021
కువైట్ సిటీ:కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో కార్మిక శక్తికి కొరత రాకుండా ముందస్తు జాగ్రత్తలు, చట్ట సవరణలు చేపడుతున్న కువైట్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న, మధ్యతరగతి పారిశ్రామిక రంగాల్లో కార్మికుల బదిలీకి సంబంధించి కనిష్ట కాల పరిమితిని ఏడాదికి కుదించింది. అంటే వర్క్ పర్మిట్ జారీ అయి ఏడాది ముగిస్తే ఆ కార్మికుడిని యజమాని అంగీకారంతో బదిలీ చేసుకోవచ్చు. గతంలో ఈ కాలపరిమితి మూడేళ్లుగా ఉండేది. ఈ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ అబ్దుల్లా అల్ సల్మాన్ మంత్రిత్వ శాఖ నుంచి తీర్మానం జారీ చేశారు. అయితే...కార్మికుల బదిలీ సమయంలో యజమాని అనుమతి విషయంలో తీర్మానం నెంబర్ 9, 2016లో పేర్కొన్న నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..
- RBI: ప్రభుత్వ ఖాతాలోకి లక్షల కోట్లు..సామాన్యులకు పన్ను ఊరట?







