భారత్ లో కరోనా కేసుల వివరాలు

- April 07, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి.కేసులు పెరుగుతున్న కఠిన చర్యలు తీసుకుంటున్నారు.ఇక ఇదిలా ఉంటె కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 1,15,736 కేసులు నమోదయ్యాయి. భారత్లో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఇదే రికార్డ్ అని చెప్పొచ్చు.భారత్లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,28,01,785కి చేరింది. ఇందులో 1,17,92,135 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 8,43,473 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో భారత్లో కరోనాతో 630 మంది మృతి చెందారు.దీంతో భారత్లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,66,177కి చేరింది.ఇక గడిచిన 24 గంటల్లో భారత్లో 59,856 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.భారత్లో ఇప్పటి వరకు మొత్తం 8,70,77,474 మందికి వ్యాక్సిన్ అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com