ఒమన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- April 07, 2021మస్కట్: కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఒమన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ పౌరులు, నివాసితులకు మాత్రమే సుల్తానేట్లోకి ప్రవేశించడానికి అనుమతించాలని నిర్ణయించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విదేశీయులకు దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉండదు. గురువారం నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని సంబంధిత అధికారులు ప్రకటించారు. రోజువారీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ సుప్రీం కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే రమదాన్ మాసం సందర్భంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ఏడు గంటల పాటు నైట్ కర్ఫ్యూ కూడా విధించింది. ఈ కర్ఫ్యూ సమయంలో అన్ని వ్యాపార సముదాయాలు మూసి ఉంచాలని కమిటీ ఆదేశించింది.
అంతేగాక రమదాన్ సందర్భంగా మసీదులలో నిర్వహించే తారావీహ్ ప్రార్థనలను సైతం కమిటీ నిషేధించింది. దీంతోపాటు మసీదులు, గుడారాలు, బహిరంగ ప్రదేశాలలో అన్ని రకాల రమదాన్ సమావేశాలు, ఇఫ్తార్ విందులపై బ్యాన్ విధించింది. ఏప్రిల్ నెల మొత్తం అన్ని సామాజిక, క్రీడ, సాంస్కృతిక కార్యకలాపాలు నిషేధించబడ్డాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు