ఒమన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- April 07, 2021మస్కట్: కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఒమన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ పౌరులు, నివాసితులకు మాత్రమే సుల్తానేట్లోకి ప్రవేశించడానికి అనుమతించాలని నిర్ణయించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విదేశీయులకు దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉండదు. గురువారం నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని సంబంధిత అధికారులు ప్రకటించారు. రోజువారీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ సుప్రీం కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే రమదాన్ మాసం సందర్భంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ఏడు గంటల పాటు నైట్ కర్ఫ్యూ కూడా విధించింది. ఈ కర్ఫ్యూ సమయంలో అన్ని వ్యాపార సముదాయాలు మూసి ఉంచాలని కమిటీ ఆదేశించింది.
అంతేగాక రమదాన్ సందర్భంగా మసీదులలో నిర్వహించే తారావీహ్ ప్రార్థనలను సైతం కమిటీ నిషేధించింది. దీంతోపాటు మసీదులు, గుడారాలు, బహిరంగ ప్రదేశాలలో అన్ని రకాల రమదాన్ సమావేశాలు, ఇఫ్తార్ విందులపై బ్యాన్ విధించింది. ఏప్రిల్ నెల మొత్తం అన్ని సామాజిక, క్రీడ, సాంస్కృతిక కార్యకలాపాలు నిషేధించబడ్డాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా