టీటీడీ సంచలన నిర్ణయం..
- April 07, 2021తిరుమల: కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోన్న నేపధ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం టైంస్లాట్(ఎస్ఎస్డి) టోకెన్ల జారీని వచ్చే సోమవారం అనగా ఏప్రిల్ 12వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలియజేసింది. తిరుపతి నగరంలో కరోనా కేసులు క్రమేపీ పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది.
ప్రతీ రోజూ తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల కోసం వేల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. దీని వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదముంది. ఈ పరిస్థితుల్లో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరిగి సర్వదర్శనం టోకెన్ల ఎప్పుడు జారీ చేసేది ముందుగానే తెలియజేస్తామని తెలిపింది. కాగా, మహారాష్ట్రలో కరోనా కేసులు ఉధృతమవుతున్న క్రమంలో షిర్డీ ఆలయ దర్శనాన్ని కూడా నిలిపేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!