స్కూల్ స్టాఫ్ వారానికోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే!
- April 08, 2021
దుబాయ్: ఇక నుంచి ప్రతి విద్యాసంస్థలోని సిబ్బంది ఖచ్చితంగా ప్రతి ఏడు రోజులకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని దుబాయ్ విజ్ఞాన, నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు అన్ని అర్హతలు ఉండి కూడా వ్యాక్సిన్ తీసుకొని వాళ్లందరికి ఈ నిబంధన వర్తిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దుబాయ్ పరిధిలోని ప్రాథమిక తరగతుల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఈ నియమం వర్తిస్తుంది. ఆన్ లైన్ క్లాసులు చెప్పే టీచర్లు కూడా ప్రతి ఏడు రోజులకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ సమర్పించాల్సిందే. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఆ వెంటనే పీసీఆర్ టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే..నిబంధనల మేరకు వ్యాక్సిన్ వేయించుకునేందుకు అర్హులు కాని వారు...ఇప్పటికే ఫస్ట్ డోస్ వేయించుకున్న వారికి మాత్రం పీసీఆర్ టెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్
- రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ







