స్కూల్ స్టాఫ్ వారానికోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే!
- April 08, 2021దుబాయ్: ఇక నుంచి ప్రతి విద్యాసంస్థలోని సిబ్బంది ఖచ్చితంగా ప్రతి ఏడు రోజులకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని దుబాయ్ విజ్ఞాన, నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు అన్ని అర్హతలు ఉండి కూడా వ్యాక్సిన్ తీసుకొని వాళ్లందరికి ఈ నిబంధన వర్తిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దుబాయ్ పరిధిలోని ప్రాథమిక తరగతుల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఈ నియమం వర్తిస్తుంది. ఆన్ లైన్ క్లాసులు చెప్పే టీచర్లు కూడా ప్రతి ఏడు రోజులకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ సమర్పించాల్సిందే. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఆ వెంటనే పీసీఆర్ టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే..నిబంధనల మేరకు వ్యాక్సిన్ వేయించుకునేందుకు అర్హులు కాని వారు...ఇప్పటికే ఫస్ట్ డోస్ వేయించుకున్న వారికి మాత్రం పీసీఆర్ టెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం