ప్రైవేట్ వైద్య సంస్థల్లో కోవిడ్ టెస్ట్ రేట్లపై ఖతార్ ప్రభుత్వం క్లారిటీ
- April 08, 2021దోహా: కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వ వైద్య సంస్థలపై భారం తగ్గించటంతో పాటు..ప్రజలకు కూడా త్వరతగతిన సేవలు అందించే ఉద్దేశంతో ఖతార్ ప్రభుత్వం కోవిడ్ టెస్టులపై కీలక ప్రకటన విడుదల చేసింది. ఇక నుంచి ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో విదేశాలకు వెళ్లే వారికి పీసీఆర్ టెస్టులు చేయబోమంటూ ప్రకటించింది. వాళ్లందరూ ప్రైవేట్ వైద్య కేంద్రాల్లో టెస్టులు చేయించుకోవాల్సిందిగా స్పష్టం చేసింది. అయితే..కోవిడ్ టెస్టుల కోసం వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రైవేట్ వైద్య కేంద్రాలు పీసీఆర్ టెస్టుల రేట్లను ఇష్టానుసారంగా వసూలు చేయకుండా నియంత్రించేందుకు కోవిడ్ టెస్టుల చార్జీలను QR 300కి ఫిక్స్ చేసింది. అంతకుమించి ఎక్కువ డబ్బులు వసూలు చేయకూడదని ఆదేశించింది. అదేవిధంగా మరో 40 వైద్యసంస్థలకు కోవిడ్ టెస్టులు చేసే అవకాశాన్ని కల్పిస్తూ అనుమతి మంజూరు చేసింది.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..