ప్రైవేట్ వైద్య సంస్థల్లో కోవిడ్ టెస్ట్ రేట్లపై ఖతార్ ప్రభుత్వం క్లారిటీ
- April 08, 2021దోహా: కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వ వైద్య సంస్థలపై భారం తగ్గించటంతో పాటు..ప్రజలకు కూడా త్వరతగతిన సేవలు అందించే ఉద్దేశంతో ఖతార్ ప్రభుత్వం కోవిడ్ టెస్టులపై కీలక ప్రకటన విడుదల చేసింది. ఇక నుంచి ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో విదేశాలకు వెళ్లే వారికి పీసీఆర్ టెస్టులు చేయబోమంటూ ప్రకటించింది. వాళ్లందరూ ప్రైవేట్ వైద్య కేంద్రాల్లో టెస్టులు చేయించుకోవాల్సిందిగా స్పష్టం చేసింది. అయితే..కోవిడ్ టెస్టుల కోసం వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రైవేట్ వైద్య కేంద్రాలు పీసీఆర్ టెస్టుల రేట్లను ఇష్టానుసారంగా వసూలు చేయకుండా నియంత్రించేందుకు కోవిడ్ టెస్టుల చార్జీలను QR 300కి ఫిక్స్ చేసింది. అంతకుమించి ఎక్కువ డబ్బులు వసూలు చేయకూడదని ఆదేశించింది. అదేవిధంగా మరో 40 వైద్యసంస్థలకు కోవిడ్ టెస్టులు చేసే అవకాశాన్ని కల్పిస్తూ అనుమతి మంజూరు చేసింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ