విదేశాలకు కరోనా వ్యాక్సిన్ ఎగుమతి పై అభ్యంతరం: రాహుల్ గాంధీ
- April 09, 2021
న్యూ ఢిల్లీ: విదేశాలకు కరోనా వ్యాక్సిన్ ఎగుమతి మీద రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతిని రాహుల్ గాంధీ తప్పు పట్టారు. దేశ ప్రజలను ప్రమాదంలోకి నెట్టడం సమంజసమేనా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కరోనా ఉధృతి దశలో వ్యాక్సిన్ కొరత తీవ్రమైన సమస్య అని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఉత్సవం జరపాలని ప్రధాని పిలుపు ఇవ్వడం మీద రాహుల్ విమర్శలు గుప్పించారు.
వ్యాక్సిన్ కొరత ఉందని రాష్ట్రాలు చెబుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని రాహుల్ విమర్శించారు. వివక్ష చూపకుండా అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలానే వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ వేయాలని కోరుతూ ప్రధానికి రాహుల్ గాంధీ లేఖ రాశారు. వెంటనే టీకాలు ఎగుమతి నిలిపేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఇతర వ్యాక్సిన్లను త్వరగా తీసుకు వచ్చేందుకు కృషి చేయాలన్నారు.
తాజా వార్తలు
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!
- తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!









