'మేజర్' నుంచి శోభితా ధూళిపాళ్ల ఫస్ట్ లుక్ విడుదల
- April 09, 2021హైదరాబాద్: యంగ్ టాలెంటెడ్ హీరో అడవిశేష్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన మూవీ 'మేజర్'.హీరో అడవి శేష్ సరసన శోభిత ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ప్రమోద అనే పాత్రలో శోభిత నటిస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలియజేశారు. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ఈ మూవీ నిర్మాణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు భాగం కావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా టీజర్ ను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నారు. 'మేజర్' చిత్రంలో జులై 2న తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు మేకర్స్.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్