హైదరాబాద్లో నాలుగు కొత్త కోవిడ్ కేంద్రాలు
- April 10, 2021
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో నాలుగు కరోనా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది.ఇందుకోసం రూ.1.79 కోట్లను కూడా విడుదల చేయాలని నిర్ణయించింది. జాతీయ ఆరోగ్య మిషన్కు చెందిన నిధులను ఈ అవసరాల కోసం ఖర్చు చేసేలా.. హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కేంద్రాలు నగరంలోని ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రి, బేగంపేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రి, చార్మినార్లోని నిజామియా టిబ్బి ఆసుపత్రి, మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రులను కరోనా కేర్ సెంటర్లుగా మారుస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జాతీయ హెల్త్ మిషన్ ద్వారా వచ్చే రూ.1.79 కోట్లను తక్షణం పారిశుధ్యం, సెక్యూరిటీ, లాండ్రీ, బయో వ్యర్థాల నిర్వహణ, కరోనా పేషెంట్ల ఆహారపు అవసరాలకు ఖర్చు చేయాలని రిజ్వి స్పష్టం చేశారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







