ఏపీలో కరోనా కేసుల వివరాలు

- April 10, 2021 , by Maagulf
ఏపీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి: ఏపీలో మళ్ళీ ఈరోజు కూడా పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదయ్యాయి.నిన్న ఏకంగా 2,558 కరోనా కేసులు నమోదు కాగా ఈ రోజు ఏకంగా వెయ్యి కేసులు పెరిగాయి.తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,309 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 921906కు చేరింది.ఇందులో 895949 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 18666 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా పది మంది మృతి చెందారు.దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7291 మంది మృతి చెందారు.ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,053 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.ఇక రాష్ట్ర వ్యాప్తంగా 31,929 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.పెద్ద ఎత్తున చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com