ఏపీలో కరోనా కేసుల వివరాలు
- April 10, 2021
అమరావతి: ఏపీలో మళ్ళీ ఈరోజు కూడా పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదయ్యాయి.నిన్న ఏకంగా 2,558 కరోనా కేసులు నమోదు కాగా ఈ రోజు ఏకంగా వెయ్యి కేసులు పెరిగాయి.తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,309 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 921906కు చేరింది.ఇందులో 895949 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 18666 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా పది మంది మృతి చెందారు.దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7291 మంది మృతి చెందారు.ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,053 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ఇక రాష్ట్ర వ్యాప్తంగా 31,929 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.పెద్ద ఎత్తున చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!
- యూఏఈలో భారీగా డ్రగ్స్ సీజ్..13మంది అరెస్టు..!!
- ప్రోగ్రామింగ్ లోపం..సౌదీలో హ్యుందాయ్ వెహికిల్స్ రీకాల్..!!
- మే 7వరకు ఒమన్ లో సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు..!!
- కువైట్లో ట్రాఫిక్ మార్పులు: ఐదవ రింగ్ రోడ్డుపై 14 రోజుల పాటు లేన్లు మూసివేత
- NTPCలో 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
- దుబాయ్లో ప్రాపర్టీ ఇన్వెస్టర్లకు రెండు సంవత్సరాల రెసిడెన్సీ వీసా నిబంధనల్లో మార్పులు
- మేలో బ్యాంక్ హాలిడేస్ ఫుల్ లిస్ట్..!









