నిజామాబాద్ లో ఈ నెల 5న పాస్ పోర్ట్ మేళా

- March 02, 2016 , by Maagulf
నిజామాబాద్ లో ఈ నెల 5న పాస్ పోర్ట్ మేళా

హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం ఆధ్వర్యంలో నిజామాబాద్ పాస్ పోర్ట్ సేవా కేంద్రంలో ఈ నెల 5న పాస్ పోర్ట్ మేళాను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పాస్ పోర్ట్ కావాల్సిన అభ్యర్థులు బుధవారం నుంచి ఆన్ లైన్ లో www. passportindia.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మొదటిసారిగా పాస్ పోర్ట్ కు దరఖస్తు చేసుకునేవారి, పునరుద్ధరణ కావాల్సినవారి సాధారణ అప్లికేషన్లను మాత్రమే మేళాలో పరిశీలిస్తామని, ఆన్ హోల్డ్, వాకిన్, పీసీసీ, తత్కాల్ అప్లికేషన్ లను పరిశీలించబోమని అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com