తెలుగు లోగిళ్లలో ఆనందాల హరివిల్లు ఉగాది వేడుక: ఏపీ గవర్నర్
- April 12, 2021
అమరావతి: సమాజంలోని అన్ని వర్గాల ప్రజలలో 'శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది' శాంతి, సామరస్యం, ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని గవర్నర్ మాట్లాడుతూ ఈ సంతోషకరమైన పండుగ శుభవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేసారు. సాధారణంగా నూతన సంవత్సరం ప్రజలకు తమ ఉజ్వల భవిష్యత్తుపై కొత్త ఆశలను చిగురింప చేస్తుందని, ఈ క్రమంలో ప్రతి ఇంటా శుభం కలగాలని తాను కోరుకుంటున్నానని గవర్నర్ అన్నారు. కరోనా విపత్కర పరిస్దితులలో ప్రజలంతా ఇంట్లోనే ఉండి వారి కుటుంబ సభ్యులతో ఉగాది పండుగను జరుపు కోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేసారు. సామాజిక దూరాన్ని పాటించటం, ముఖ ముసుగును తప్పని సరిగా ధరించడం, శానిటైజర్ను ఉపయోగిస్తూ తరచూ చేతులు శుభ్రం చేసుకోవటం ద్వారా కరోనా నుండి విముక్తి పొందగలుగుతామని గవర్నర్ హరిచందన్ వివరించారు. కరోనా టీకా సురక్షితమన్న విషయం ఇప్పటికే స్పష్టం అయినందున అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి టీకా వేయించుకోవాలని, తద్వారా కరోనా గొలుసును విచ్ఛిన్నం చేయగలుగుతామని గవర్నర్ స్పష్టం చేసారు.ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.
తాజా వార్తలు
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!









