తెలుగు లోగిళ్లలో ఆనందాల హరివిల్లు ఉగాది వేడుక: ఏపీ గవర్నర్
- April 12, 2021
అమరావతి: సమాజంలోని అన్ని వర్గాల ప్రజలలో 'శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది' శాంతి, సామరస్యం, ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని గవర్నర్ మాట్లాడుతూ ఈ సంతోషకరమైన పండుగ శుభవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేసారు. సాధారణంగా నూతన సంవత్సరం ప్రజలకు తమ ఉజ్వల భవిష్యత్తుపై కొత్త ఆశలను చిగురింప చేస్తుందని, ఈ క్రమంలో ప్రతి ఇంటా శుభం కలగాలని తాను కోరుకుంటున్నానని గవర్నర్ అన్నారు. కరోనా విపత్కర పరిస్దితులలో ప్రజలంతా ఇంట్లోనే ఉండి వారి కుటుంబ సభ్యులతో ఉగాది పండుగను జరుపు కోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేసారు. సామాజిక దూరాన్ని పాటించటం, ముఖ ముసుగును తప్పని సరిగా ధరించడం, శానిటైజర్ను ఉపయోగిస్తూ తరచూ చేతులు శుభ్రం చేసుకోవటం ద్వారా కరోనా నుండి విముక్తి పొందగలుగుతామని గవర్నర్ హరిచందన్ వివరించారు. కరోనా టీకా సురక్షితమన్న విషయం ఇప్పటికే స్పష్టం అయినందున అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి టీకా వేయించుకోవాలని, తద్వారా కరోనా గొలుసును విచ్ఛిన్నం చేయగలుగుతామని గవర్నర్ స్పష్టం చేసారు.ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.
తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







