ఇవాళ రాత్రి నుంచి అమల్లోకి లాక్డౌన్ ఆంక్షలు
- April 14, 2021
మస్కట్: రోజురోజుకీ కరోనా తీవ్రత పెరగుతుండటంతో ఒమన్ ప్రభుత్వం పాక్షిక ఆంక్షల వైపే మొగ్గు చూపింది. ఇవాళ్టి రాత్రి నుంచి లాక్డౌన్ ఆంక్షలు అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలను పాటించాలని సూచించింది. ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఉండదు. అలాగే ప్రజలు బయట తిరగకూడదు. అత్యవసర వాహనాలను మినహా మిగిలిన వాహనదారులను అనుమతి ఉండదు. రంజాన్ మాసం మొత్తం లాక్డౌన్ కొనసాగుతుందని ఒమన్ స్పష్టత ఇచ్చింది. ఇదిలాఉంటే ఒమన అధికారులు ఆన్ లైన్ ద్వారా విడుదల చేసిన ఓ ప్రకటనలో కరోనా తీవ్రత దృష్ట్యా తారావిహ్ ప్రార్థనలకు కూడా అనుమతి లేదని వెల్లడించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







