ఇవాళ రాత్రి నుంచి అమ‌ల్లోకి లాక్డౌన్ ఆంక్ష‌లు

- April 14, 2021 , by Maagulf
ఇవాళ రాత్రి నుంచి అమ‌ల్లోకి లాక్డౌన్ ఆంక్ష‌లు

మస్కట్: రోజురోజుకీ క‌రోనా తీవ్ర‌త పెర‌గుతుండ‌టంతో ఒమ‌న్ ప్ర‌భుత్వం పాక్షిక ఆంక్ష‌ల వైపే మొగ్గు చూపింది. ఇవాళ్టి రాత్రి నుంచి లాక్డౌన్ ఆంక్ష‌లు అమ‌ల్లోకి వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు ప్ర‌జ‌లంతా లాక్డౌన్ నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని సూచించింది. ఆంక్ష‌లు అమ‌లులో ఉన్న స‌మ‌యంలో ఎలాంటి వాణిజ్య కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తి ఉండ‌దు. అలాగే ప్ర‌జ‌లు బ‌య‌ట తిర‌గ‌కూడ‌దు. అత్య‌వ‌స‌ర వాహ‌నాల‌ను మిన‌హా మిగిలిన వాహ‌న‌దారుల‌ను అనుమ‌తి ఉండ‌దు. రంజాన్ మాసం మొత్తం లాక్డౌన్ కొన‌సాగుతుంద‌ని ఒమ‌న్ స్ప‌ష్ట‌త ఇచ్చింది. ఇదిలాఉంటే ఒమ‌న అధికారులు ఆన్ లైన్ ద్వారా విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో క‌రోనా తీవ్ర‌త దృష్ట్యా తారావిహ్ ప్రార్థ‌న‌ల‌కు కూడా అనుమ‌తి లేద‌ని వెల్ల‌డించింది.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com