ఇవాళ రాత్రి నుంచి అమల్లోకి లాక్డౌన్ ఆంక్షలు
- April 14, 2021
మస్కట్: రోజురోజుకీ కరోనా తీవ్రత పెరగుతుండటంతో ఒమన్ ప్రభుత్వం పాక్షిక ఆంక్షల వైపే మొగ్గు చూపింది. ఇవాళ్టి రాత్రి నుంచి లాక్డౌన్ ఆంక్షలు అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలను పాటించాలని సూచించింది. ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఉండదు. అలాగే ప్రజలు బయట తిరగకూడదు. అత్యవసర వాహనాలను మినహా మిగిలిన వాహనదారులను అనుమతి ఉండదు. రంజాన్ మాసం మొత్తం లాక్డౌన్ కొనసాగుతుందని ఒమన్ స్పష్టత ఇచ్చింది. ఇదిలాఉంటే ఒమన అధికారులు ఆన్ లైన్ ద్వారా విడుదల చేసిన ఓ ప్రకటనలో కరోనా తీవ్రత దృష్ట్యా తారావిహ్ ప్రార్థనలకు కూడా అనుమతి లేదని వెల్లడించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









