ఈ-వీసాలపై ఆంక్షలు తొలగించిన MHA
- April 14, 2021
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ టూరిస్ట్ వీసా మినహా మిగిలిన అన్ని ఎలక్ట్రానిక్ వీసాలపై గతంలో విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది. దీంతో దాదాపు 156 దేశాల నుంచి ఈ-వీసాలపై మన దేశానికి వేర్వేరు కార్యకలాపాల కోసం రావచ్చు.ఈ-మెడికల్ వీసా, ఈ-కాన్ఫరెన్స్ వీసా, ఈ-బిజినెస్ వీసా, ఈ-మెడికల్ అటెండెంట్ వీసాలతో విదేశీయులు మన దేశానికి రావచ్చు. కోవిడ్-19 మహమ్మారి పెరుగుతున్న నేపథ్యంలో గత ఏడాది మార్చిలో ఈ వీసాలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది మార్చి 30న కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల్లో ఈ-మెడికల్ వీసా, ఈ-కాన్ఫరెన్స్ వీసా, ఈ-బిజినెస్ వీసా, ఈ-మెడికల్ అటెండెంట్ వీసాలను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపింది. బ్రిటన్, చైనాల నుంచి వచ్చేవారిపై ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది.
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు మాట్లాడుతూ, కోవిడ్-19 కేసులు ప్రస్తుత స్థాయికి చేరడానికి ముందు ఈ ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. ఈ-మెడికల్, ఈ-బిజినెస్ వీసాల కోసం గడచిన 10 రోజుల్లో చాలా తక్కువ దరఖాస్తులు వచ్చాయన్నారు. ఒక ప్రయోజనం కోసం తీసుకున్న వీసాను వేరొక ప్రయోజనం కోసం ఉపయోగించకూడదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







