ఈ-వీసాలపై ఆంక్షలు తొలగించిన MHA
- April 14, 2021
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ టూరిస్ట్ వీసా మినహా మిగిలిన అన్ని ఎలక్ట్రానిక్ వీసాలపై గతంలో విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది. దీంతో దాదాపు 156 దేశాల నుంచి ఈ-వీసాలపై మన దేశానికి వేర్వేరు కార్యకలాపాల కోసం రావచ్చు.ఈ-మెడికల్ వీసా, ఈ-కాన్ఫరెన్స్ వీసా, ఈ-బిజినెస్ వీసా, ఈ-మెడికల్ అటెండెంట్ వీసాలతో విదేశీయులు మన దేశానికి రావచ్చు. కోవిడ్-19 మహమ్మారి పెరుగుతున్న నేపథ్యంలో గత ఏడాది మార్చిలో ఈ వీసాలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది మార్చి 30న కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల్లో ఈ-మెడికల్ వీసా, ఈ-కాన్ఫరెన్స్ వీసా, ఈ-బిజినెస్ వీసా, ఈ-మెడికల్ అటెండెంట్ వీసాలను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపింది. బ్రిటన్, చైనాల నుంచి వచ్చేవారిపై ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది.
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు మాట్లాడుతూ, కోవిడ్-19 కేసులు ప్రస్తుత స్థాయికి చేరడానికి ముందు ఈ ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. ఈ-మెడికల్, ఈ-బిజినెస్ వీసాల కోసం గడచిన 10 రోజుల్లో చాలా తక్కువ దరఖాస్తులు వచ్చాయన్నారు. ఒక ప్రయోజనం కోసం తీసుకున్న వీసాను వేరొక ప్రయోజనం కోసం ఉపయోగించకూడదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!
- హౌతీ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు..!!
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా







