ఈ-వీసాలపై ఆంక్షలు తొలగించిన MHA
- April 14, 2021
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ టూరిస్ట్ వీసా మినహా మిగిలిన అన్ని ఎలక్ట్రానిక్ వీసాలపై గతంలో విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది. దీంతో దాదాపు 156 దేశాల నుంచి ఈ-వీసాలపై మన దేశానికి వేర్వేరు కార్యకలాపాల కోసం రావచ్చు.ఈ-మెడికల్ వీసా, ఈ-కాన్ఫరెన్స్ వీసా, ఈ-బిజినెస్ వీసా, ఈ-మెడికల్ అటెండెంట్ వీసాలతో విదేశీయులు మన దేశానికి రావచ్చు. కోవిడ్-19 మహమ్మారి పెరుగుతున్న నేపథ్యంలో గత ఏడాది మార్చిలో ఈ వీసాలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది మార్చి 30న కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల్లో ఈ-మెడికల్ వీసా, ఈ-కాన్ఫరెన్స్ వీసా, ఈ-బిజినెస్ వీసా, ఈ-మెడికల్ అటెండెంట్ వీసాలను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపింది. బ్రిటన్, చైనాల నుంచి వచ్చేవారిపై ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది.
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు మాట్లాడుతూ, కోవిడ్-19 కేసులు ప్రస్తుత స్థాయికి చేరడానికి ముందు ఈ ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. ఈ-మెడికల్, ఈ-బిజినెస్ వీసాల కోసం గడచిన 10 రోజుల్లో చాలా తక్కువ దరఖాస్తులు వచ్చాయన్నారు. ఒక ప్రయోజనం కోసం తీసుకున్న వీసాను వేరొక ప్రయోజనం కోసం ఉపయోగించకూడదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









