భారత్ లో కరోనా కేసుల వివరాలు
- April 16, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో విజృంభణ దారుణంగా ఉంది.రోజు రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.ప్రపంచంలో రోజువారీ కేసుల్లో భారత్ టాప్ లిస్ట్ లో ఉన్నది.కేసులతో పాటుగా మరణాల సంఖ్యకూడా పెరుగుతున్నది.సెకండ్ వేవ్ లో కేసులు విజృంభిస్తుండటంతో కేంద్రం కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నది.ఇక ఇదిలా ఉంటె తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో భారత్ లో 2,17,353 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,42,91,917కి చేరింది.ఇందులో 1,25,47,866 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 15,69,743 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1185 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,74,308కి చేరింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









