రమదాన్: వర్చువల్ యాక్టివిటీస్ నిర్వహించనున్న మ్యూజియంలు
- April 17, 2021
ఖతార్: ఖతార్ లో పలు మ్యూజియంలు పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో వర్చువల్ కార్యక్రమాల్ని నిర్వహించనున్నాయి. ఖతార్ చిల్డ్రన్స్ మ్యూజియం (క్యుసిఎం), గరంగావ్ వర్క్ షాప్ నిర్వహించనుంది. సంప్రదాయ బాస్కెట్ వీవింగ్ నేర్పిస్తారు ఈ కార్యక్రమంలో. స్వీట్లు, నట్స్ పొందుపర్చడానికి వీటిని వినియోగిస్తారు. కీచెయిన్ల మేకింగ్ వంటి కార్యక్రమాల నిర్వహణ కూడా జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, 11 గంటల నుంచి 12 గంటల వరకు రెండు సెషన్లలో ఈ కార్యక్రమాలు నడుస్తాయి. 6 నుంచి 11 ఏళ్ళ వయసుగల చిన్నారులు వీటిల్లో పాల్గొనవచ్చు. షేక్ ఫైసల్ బిన్ కాసిం అల్ థని మ్యూజియం బిహైండ్ యాన్ ఆబ్జెక్ట్ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించనుంది. సంప్రదాయ పద్ధతుల్లో స్టోరీ టెల్లింగ్ ఈ కార్యక్రమం ప్రత్యేకత. కళా రూపాల ప్రదర్శన ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏప్రిల్ 29 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 7 నుంచి 12 ఏళ్ళ వయసు వారికి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశ వుంది. మ్యూజియం స్పార్క్స్ వంటి కార్యక్రమాల్నీ నిర్వహిస్తారు. 3-2-1 ఖతార్ ఒలింపిక్ మరియు స్పోర్ట్స్ మ్యూజియం ప్రముఖ అథ్లెట్ల ఇంటర్వ్యూలను ప్రసారం చేయనున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







