కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు
- April 17, 2021
ఒమన్: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకుగాను అవసరమైతే మరింత కఠిన చర్యలకు వెనుకాడకూడదని ఒమన్ అథారిటీస్ భావిస్తున్నాయి. దోఫార్ గవర్నరేట్ పరిధిలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సుప్రీం కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, పూర్తి లాక్ డౌన్ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు దోఫార్ గవర్నరేట్ పరిధిలో వ్యాపార కార్యకలాపాల్ని సస్పెండ్ చేస్తున్నామనీ, ఏప్రిల్ 17 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అథారిటీస్ పేర్కొన్నాయి. ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్కులు ధరించాలనీ, ఎక్కముంది గుమికూడకూడదనీ, ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకుంటూ వుండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







