కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు
- April 17, 2021
ఒమన్: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకుగాను అవసరమైతే మరింత కఠిన చర్యలకు వెనుకాడకూడదని ఒమన్ అథారిటీస్ భావిస్తున్నాయి. దోఫార్ గవర్నరేట్ పరిధిలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సుప్రీం కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, పూర్తి లాక్ డౌన్ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు దోఫార్ గవర్నరేట్ పరిధిలో వ్యాపార కార్యకలాపాల్ని సస్పెండ్ చేస్తున్నామనీ, ఏప్రిల్ 17 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అథారిటీస్ పేర్కొన్నాయి. ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్కులు ధరించాలనీ, ఎక్కముంది గుమికూడకూడదనీ, ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకుంటూ వుండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







