యూఏఈ చేరుకున్న భారత మంత్రి జై శంకర్, షేక్ అబ్దుల్లాతో సమావేశం
- April 19, 2021యూఏఈ: భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, యూఏఈ చేరుకున్నారు. మినిస్టర్, ఈ సందర్భంగా షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అలాగే ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ యూఏఈ)తో కలిసి వున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. షేక్ అబ్దుల్లాతో సమావేశం కానుండడం పట్ల ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు జై శంకర్. కాగా, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ ఖురేషీ కూడా యూఏఈలోనే వున్నారు. భారత విదేశాంగ మంత్రితో ఎలాంటి సమావేశం వుండదని పాకిస్తన్ విదేశాంగ మంత్రి చెప్పారు. కాగా, యూఏఈతో భారతదేశానికి సన్నిహిత సంబంధాలున్నాయనీ, ఎకనమిక్ కో-ఆపరేషన్ అలాగే కమ్యూనిటీ వెల్ఫేర్ వంటి అంశాలపై యూఏఈతో భారత విదేశాంగ మంత్రి చర్చలు జరుపుతారని, విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, భారత విదేశాంగ మంత్రి అలాగే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఒకే సమయంలో యూఏఈలో వుండడం చాలా అరుదైన సంఘటన అని అధికారిక వర్గాలంటున్నాయి. కాగా, గత నవంబర్ నెలలో జై శంకర్, యూఏఈలో పర్యటించారు. షేక్ అబ్దుల్లా, జై శంకర్ ను ఢిల్లీలో ఫిబ్రవరిలో కలిశారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..