ఎయిర్ ఆసియా ఎయిర్లైన్స్ కీలక ప్రకటన

- April 19, 2021 , by Maagulf
ఎయిర్ ఆసియా ఎయిర్లైన్స్ కీలక ప్రకటన

న్యూఢిల్లీ: కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణాలకు సంబంధించిన ఆంక్షలు, అనిశ్చిత పరిస్థితులు పెరిగిపోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని విమాన ప్రయాణికులకు కాస్త వెసులుబాటు కల్పించేందుకు ఎయిర్‌ ఆసియా ఇండియా తాజాగా ఒక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా మే 15 వరకు బుక్‌ చేసుకున్న టికెట్లలో సమయం, తేదీలో చేసుకునే మార్పులకు ఎలాంటి రుసుమును వసూలు చేయబోమని ఆదివారం ప్రకటించింది. కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు పలు రకాల ఆంక్షలను విధిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇండిగో, స్పైస్‌జెట్‌ వంటి కంపెనీలు ఉచితంగా రీషెడ్యూలింగ్‌కు అనుమతిస్తున్నట్టు ప్రకటించాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com