రమదాన్ మాసంలోనూ రక్తదానం చేయండి: డిబిబిఎస్
- April 19, 2021మస్కట్: పవిత్ర రమదాన్ మాసంలోనూ రక్తదానం చేయవచ్చునని డిపార్టుమెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ (డిబిబిఎస్) వెల్లడించింది. రమదాన్ మాసం నేపథ్యంలో రక్తదాతల సంఖ్య తగ్గడం వల్ల, రక్తం అవసరమైనవారికి తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయని డిబిబిఎస్ పేర్కొంది. సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ (బౌషర్) ఈ సమస్యను ఎదుర్కొంటోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రక్తదానం చేయాలని సూచించారు. వాట్సాప్ ద్వారా (94555648) రక్తదానానికి సంబంధించి అపాయింట్మెంట్లను పొందవచ్చు. ఐడీ కార్డు కాపీ ద్వారా వివరాల్ని నమోదు చేయవచ్చు. బ్ల్ డోనర్ పర్మిట్ కాపీని వాట్సాప్ ద్వారా పంపిస్తారు. బ్లడ్ బ్యాంక్ వద్దకు వెళితే ఒరిజినల్ పర్మిట్ ఇవ్వబడుతుంది.
తాజా వార్తలు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!