వచ్చే నవంబరులో యూఏఈ బెలూన్ ఫ్లాగ్ ప్రారంభం
- April 19, 2021యూఏఈ: యూఏఈ బెలూన్ టీమ్, ‘యూఏఈ ఫ్లాగ్ బెలూన్’ ప్రారంభానికి సంబంధించి సన్నాహాలు మొదలు పెట్టింది. అబుదాబీ నుంచి ప్రారంభించి రీజినల్ అలాగే గ్లోబల్ టూర్లను బెలూన్ నిర్వహించనుంది. ఈ టీమ్ ప్రస్తుతం తమ వెబ్ సైట్ తయారీలో నిమగ్నమైంది. ‘ది వరల్డ్ విల్ నాట్ ఫర్గెట్ యు జాయెద్’ పేరుతో 18 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఫౌండర్ ఫాదర్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ సేవలకు గుర్తింపుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కెప్టెన్ పైలట్ అబ్దుల్ అజీజ్ నాజర్ అల్ మన్సూరి (యూఏఈ బెలూన్ టీమ్ ప్రెసిడెంట్), పలు రీజినల్ అలాగే ఇంటర్నేషనల్ బహుమతుల్ని పలువురు ప్రముఖుల నుంచి అందుకున్నారు. పలు అరబ్ దేశాలు అలాగే ఇజ్రాయెల్, సుడాన్ మరియు మొరాకో వంటి దేశాల మీదుగా బెలూన్ టూర్ నడుస్తుందని యూఏఈ బెలూన్ టెక్నికల్ సూపర్వైజర్ కెప్టెన్ రసెల్ క్లాక్ వెల్లడించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ