రమదాన్ మాసంలోనూ రక్తదానం చేయండి: డిబిబిఎస్
- April 19, 2021మస్కట్: పవిత్ర రమదాన్ మాసంలోనూ రక్తదానం చేయవచ్చునని డిపార్టుమెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ (డిబిబిఎస్) వెల్లడించింది. రమదాన్ మాసం నేపథ్యంలో రక్తదాతల సంఖ్య తగ్గడం వల్ల, రక్తం అవసరమైనవారికి తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయని డిబిబిఎస్ పేర్కొంది. సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ (బౌషర్) ఈ సమస్యను ఎదుర్కొంటోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రక్తదానం చేయాలని సూచించారు. వాట్సాప్ ద్వారా (94555648) రక్తదానానికి సంబంధించి అపాయింట్మెంట్లను పొందవచ్చు. ఐడీ కార్డు కాపీ ద్వారా వివరాల్ని నమోదు చేయవచ్చు. బ్ల్ డోనర్ పర్మిట్ కాపీని వాట్సాప్ ద్వారా పంపిస్తారు. బ్లడ్ బ్యాంక్ వద్దకు వెళితే ఒరిజినల్ పర్మిట్ ఇవ్వబడుతుంది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు