రమదాన్ మాసంలోనూ రక్తదానం చేయండి: డిబిబిఎస్
- April 19, 2021
మస్కట్: పవిత్ర రమదాన్ మాసంలోనూ రక్తదానం చేయవచ్చునని డిపార్టుమెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ (డిబిబిఎస్) వెల్లడించింది. రమదాన్ మాసం నేపథ్యంలో రక్తదాతల సంఖ్య తగ్గడం వల్ల, రక్తం అవసరమైనవారికి తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయని డిబిబిఎస్ పేర్కొంది. సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ (బౌషర్) ఈ సమస్యను ఎదుర్కొంటోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రక్తదానం చేయాలని సూచించారు. వాట్సాప్ ద్వారా (94555648) రక్తదానానికి సంబంధించి అపాయింట్మెంట్లను పొందవచ్చు. ఐడీ కార్డు కాపీ ద్వారా వివరాల్ని నమోదు చేయవచ్చు. బ్ల్ డోనర్ పర్మిట్ కాపీని వాట్సాప్ ద్వారా పంపిస్తారు. బ్లడ్ బ్యాంక్ వద్దకు వెళితే ఒరిజినల్ పర్మిట్ ఇవ్వబడుతుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్లో సముద్ర ఉద్రిక్తతల పై 40కి పైగా దేశాలు ఆందోళన..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 చొప్పున గెలిచిన ఐదుగురు..!!
- ప్రాంతీయ పరిణామాలను సమీక్షించిన అమీర్, ఇటలీ పీఎం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 59 రకాల మాదక ద్రవ్యాలు స్వాధీనం..!!
- డ్రోన్ల అమ్మకం, పంపిణీ పై కువైట్ నిషేధం..!!
- మోసపూరిత బీమా కంపెనీలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..!!
- సహమ్లో ఇద్దరిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్









