భారత్-దుబాయ్ ప్రయాణికులకు పీసీఆర్ టెస్ట్ పై కొత్త సూచనలు
- April 20, 2021దుబాయ్: భారత్ లో కోవిడ్ తీవ్రత శరవేగంగా పెరిగిపోతుండటంతో ఇప్పటికే పలు దేశాలు ఇండియాపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో దుబాయ్ కూడా భారత్ నుంచే వచ్చే ప్రయాణికులపై ఫోకస్ చేసింది.పీసీఆర్ టెస్ట్ రిపోర్టులకు సంబంధించి కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది.దుబాయ్ ఫ్లైట్ ఎక్కే సమయానికి 48 గంటల్లోపు శాంపిల్ ఇచ్చిన పీసీఆర్ రిపోర్ట్ లనే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.ప్రయాణికులు తాము బయల్దేరే ప్రాంతంలో ఏ రోజు,ఏ సమయంలో శాంపిల్ ఇచ్చారో స్పష్టంగా పేర్కొవాలి.అలాగే రిపోర్ట్ జారీ చేసిన తేది, సమయాన్ని కూడా స్పష్టంగా పేర్కొవాలి.పీసీఆర్ రిపోర్ట్ పై ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ ఉండాలని కోడ్ స్కాన్ చేయటం ద్వారా ల్యాబ్ వివరాలతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్ వివరాలను కూడా ఎయిర్ లైన్స్ సంస్థలు క్రాస్ చెక్ చేసుకుంటాయని దుబాయ్ వెల్లడించింది.ఏప్రిల్ 22 నుంచి ఈ కొత్త మార్గనిర్దేశకాలు అమలులోకి రానున్నాయి.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..