కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్
- April 20, 2021న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొన్ని స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని.. ఇందులో కోవిడ్-19 పాజిటివ్గా తేలిందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా కరోనా నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని రాహుల్ గాంధీ సూచించారు. రాహుల్ గాంధీతో సహా అనేక మంది నేతలు కరోనా బారిన పడ్డారు. నిన్న కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ చికిత్స కోసం ఎయిమ్స్లో చేరారు.అంతకుముందు వ్యాక్సినేషన్ మూడో విడతపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.ఈ విధానంలో బలహీన వర్గాల వారికి వ్యాక్సిన్ అందుతుందనే భరోసా లేదని ఆయన ఆరోపించారు. ఇది వివక్షాపూరితమైన విధానమని దుయ్యబట్టారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..