కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్

- April 20, 2021 , by Maagulf
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్

న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొన్ని స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని.. ఇందులో కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా కరోనా నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని రాహుల్ గాంధీ సూచించారు. రాహుల్ గాంధీతో సహా అనేక మంది నేతలు కరోనా బారిన పడ్డారు. నిన్న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ చికిత్స కోసం ఎయిమ్స్‌లో చేరారు.అంతకుముందు వ్యాక్సినేషన్ మూడో విడతపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.ఈ విధానంలో బలహీన వర్గాల వారికి వ్యాక్సిన్ అందుతుందనే భరోసా లేదని ఆయన ఆరోపించారు. ఇది వివక్షాపూరితమైన విధానమని దుయ్యబట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com