"పరిశ్రమలకు ఆక్సిజన్ ను తగ్గించండి..COVID రోగులకు ఇవ్వండి" - ఢిల్లీ హై కోర్ట్ ఆదేశం
- April 20, 2021
న్యూఢిల్లీ: భారతదేశ రాజధానిలోని COVID-19 రోగులకు తగినంత ఆక్సిజన్ సరఫరా చేయబడటం లేదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం పేర్కొంది. ఈ పరిణామంలో..పరిశ్రమల నుండి హాస్పిటల్స్ కు ఆక్సిజన్ సరఫరాను మళ్లించడం సాధ్యమా అని కేంద్రాన్ని ప్రశ్నించింది.
"పరిశ్రమలు వేచి ఉండగలవు, రోగులు వేచి ఉండలేరు. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి" అని జస్టిస్ విపిన్ సంఘి మరియు రేఖ పల్లి ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ఆక్సిజన్ కొరత ఉన్నందున అక్కడ చేరిన COVID-19 రోగులకు ఆక్సిజన్ ఇవ్వడం తగ్గించాలని గంగా రామ్ ఆసుపత్రి వైద్యులు బలవంతం చేస్తున్నారని ధర్మాసనం తెలిపింది.
"ఆక్సిజన్ సరఫరాను తగ్గించలేని ఈ పరిశ్రమలు ఏవి" అని కోర్టు కేంద్ర ప్రభుత్వ లాయరు మోనికా అరోరాను ప్రశ్నించింది. COVID-19 రోగులకు ఆక్సిజన్ సరఫరాను పెంచడానికి ఏమి చేయవచ్చనే దానిపై సూచనలు తీసుకోవాలని మోనికా అరోరా ను కోర్టు కోరింది.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







