వ్యాక్సిన్ తీసుకోని వారిపై మ‌రిన్ని ఆంక్ష‌ల‌కు యూఏఈ యోచ‌న‌

- April 21, 2021 , by Maagulf
వ్యాక్సిన్ తీసుకోని వారిపై మ‌రిన్ని ఆంక్ష‌ల‌కు యూఏఈ యోచ‌న‌

యూఏఈ: వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులు అయి ఉండి..ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారిని ఆంక్ష‌ల ప‌రిధిలోకి తీసుకొచ్చేందుకు యూఏఈ ప్ర‌భుత్వం యోచిస్తోంది. వ్యాక్సిన్ తీసుకోని వారిని కొన్ని కీల‌క ప్రాంతాలకు అనుమ‌తించొద్ద‌ని అలాగే కీల‌క స‌ర్వీసుల నుంచి త‌ప్పించాల‌నే ఆలోచ‌న‌లో ఉంది.వ్యాక్సిన్ తీసుకోక‌పోవ‌టం వ‌ల్ల వారు కోవిడ్ బారిన ప‌డ‌టంతో ఇత‌రుల ఆరోగ్యాన్ని కూడా ప్ర‌మాదంలో ప‌డేస్తున్నార‌న్న‌ది జాతీయ విప‌త్తులు, నిర్వ‌హ‌ణ అథారిటీ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.వ్యాక్సిన్ తీసుకునే అవ‌కాశం ఉన్నా...తీసుకోకుండా అల‌క్ష్యం చేయ‌టం స‌మాజంలో తోటి వారికి ఇబ్బంది క‌లిగించ‌ట‌మేన‌ని అభిప్రాయ‌ప‌డింది. అందుకే వ్యాక్సిన్ తీసుకోని వారి క‌ద‌లిక‌ల‌పై ఆంక్ష‌లు విధించ‌టం ద్వారా వైర‌స్ వ్యాప్తిని నిరోధించాల‌ని చూస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com