యూకేకు వెళ్లే విమానాలను రద్దు చేసిన ఎయిరిండియా
- April 21, 2021న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది.మృతుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది.కరోనా ఉద్ధృతి దృష్ట్యా భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఇంగ్లాండ్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో యూకేకు వెళ్లే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రకటించింది.ఏప్రిల్ 24 నుంచి 30 వరకు భారత్-యూకే మధ్య విమానాలు రద్దు చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించింది.
భారత్, యూకే మధ్య ప్రయాణించే ప్యాసింజర్లకు గమనిక.. యూకే ఇటీవల ప్రకటించిన ఆంక్షల నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30 వరకు బ్రిటన్కు విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నాం. ఈనెల 24 నుంచి 30వ తేదీల్లో ఢిల్లీ, ముంబయి నుంచి యూకేకు వారానికి ఒక విమానాన్ని నడిపేందుకు ప్రణాళికలు చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెబ్సైట్, మా సోషల్మీడియా ఛానళ్లలో అప్డేట్ చేస్తాం. విమానాల రీషెడ్యూలింగ్, రీఫండ్ తదిరత వివరాలను కూడా త్వరలోనే తెలియజేస్తాం’’అని ఎయిరిండియా బుధవారం ట్వీట్ చేసింది.
« Older Article Expo 2020 Dubai spotlights five grassroots innovations to tackle COVID-19 challenges
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ