వారంలోగా 4 లక్షల ‘రెమిడెసివిర్’ ఇంజక్షన్లు - కేటీఆర్
- April 21, 2021ప్రభుత్వ ఆసుపత్రులకు వారంలోగా 4 లక్షలకుపైగా రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందేలా చూస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇవాళ రెమిడెసివిర్ ఉత్పత్తిదారులతో మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు. సీఎం ఆదేశాల మేరకు ఉత్పత్తిదారులతో చర్చించినట్లు మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత పెరిగింది. కరోనా వైరస్ సోకి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తుతున్న వారికి వైద్యులు ఆక్సిజన్తోపాటు రెమిడెసివిర్ ఇంజక్షన్లను ఇస్తున్నారు. ఫలితంగా వైరస్ లోడ్ తగ్గి రోగులు త్వరగా కోలుకుంటున్నట్టు చెబుతున్నాయి. ఇటీవల ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్యతో పాటే రెమిడెసివిర్ ఇంజక్షన్ల వినియోగం సైతం పెరిగింది.
ఉత్పత్తి తగ్గడం.. చాలాచోట్ల ఇంజక్షన్లు లభించకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఉత్పత్తి పెంచాలని తయారీ సంస్థలతో మంత్రి కేటీఆర్ ఇవాళ చర్చలు జరిపారు.
As directed by Hon’ble CM KCR Garu, have held discussions with several manufacturers of #Remdisivir today
— KTR (@KTRTRS) April 21, 2021
Have made arrangements for 4 lakh plus vials to be made available across all Govt hospitals within a week#COVIDSecondWave
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్