కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: నాలుగు రెస్టారెంట్ల మూసివేత

- April 21, 2021 , by Maagulf
కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: నాలుగు రెస్టారెంట్ల మూసివేత

బహ్రెయిన్: నాలుగు టూరిస్టిక్ రెస్టారెంట్లను కరోనా నిబంధనలు పాటించని కారణంగా వారం రోజులపాటు మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలో ఈ రెస్టారెంట్లు వున్నాయి. బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ, హెల్త్ మినిస్ట్రీ - పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ అలాగే ఇన్స్పెక్షన్ డైరెక్టరేట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం.. సంయుక్తంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. టూరిజం ఔట్ లెట్లు తప్పనిసరిగా కరోనా నిబంధనలు, ప్రికాషన్స్ పాటించాలని ఈ సందర్భంగా బిటిఇఎ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయనీ, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com