ఖతార్లో మెడిసిన్ వెండింగ్ మెషీన్లు
- March 02, 2016
మిడిల్ ఈస్ట్లో తొలిసారిగా ఖతార్ మెడిసిన్ వెండింగ్ మెషీన్లను ప్రారంభించనుంది. డాక్టర్లు సూచించిన మందుల్ని ఫార్మసిస్టులతో సంబంధం లేకుండా ఆటోమేటిక్ మెషీన్ల ద్వారా విక్రయించేందుకు ఖతార్ ఏర్పాట్లు చేస్తోంది. న్యూ విమెన్స్ హాస్పిటల్ ఈ సర్వీసు గురించిన ప్రయోగాలు చేస్తోంది. ఆసుపత్రికి చెందిన వివిధ డిపార్ట్మెంట్స్ ఆటోమేటెడ్ సెల్ఫ్ సర్వీస్ కియోస్క్లను ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకురానుంది. ఆసుపత్రి ఫార్మసీ వద్ద పేషెంట్లకు సమయం వృధా కాకుండా ఈ కియోస్కీ మెడిసిన్ వెండింగ్ మెషీన్ ఉపకరించనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. పేషెంట్ ఐడీతో డాక్టర్లు డిజిటల్ ప్రిస్క్రిప్షన్ ప్రిపేర్ చేస్తారు. దానికి ఓ ఐడీని క్రియేట్ చేస్తారు. కియోస్కీ వద్దకు వెళ్ళి ఐడీని నమోదు చేస్తే, దానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ తద్వారా మందులు రానున్నాయి. ఫార్మసిస్టుల కొరత నుంచి ఆసుపత్రులకూ ఈ కియోస్కీల ద్వారా ఉపశమనం కలుగుతుంది. అదే సమయంలో పేషెంట్లకు మెరుగైన విధంగా మందులు అందుతాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







