భారత్: 3 లక్షలు దాటిన కరోనా కేసులు...

- April 22, 2021 , by Maagulf
భారత్: 3 లక్షలు దాటిన కరోనా కేసులు...

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.  రోజువారీ పాజిటివ్ కేసులు నిన్నటి వరకు మూడు లక్షల వరకు నమోదుకాగా, ఈరోజు ఆ సంఖ్య మూడు లక్షలు దాటింది.తాజగా దేశంలో 3,14,835 కరోనా కేసులు నమోదు కాగా, 2014 మరణాలు సంభవించాయి.దేశంలో ఇప్పటి వరకు 1,59,30,965 కరోనా కేసులు నమోదు కాగా, 1,84,657 మరణాలు సంభవించాయి.ఇక దేశంలో ఇప్పటి వరకు 1,34,54,880 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 22,91,428 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.దేశంలో గడిచిన 24 గంటల్లో 1,78,841 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇకపోతే భారత్ లో ఇప్పటి వరకు మొత్తం 13,23,30,644 మందికి వ్యాక్సిన్ ను అందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com