‘ఎక్స్ఛేంజీ హౌస్’కి 496,000 దిర్హాముల జరీమానా
- April 22, 2021యూఏఈ: యాంటీ మనీ లాండరింగ్ - ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం మరియు ఇల్లీగల్ ఆపరేషన్స్ నిబంధనల్ని ఉల్లంఘించిన నేపథ్యంలో ఓ మనీ ఎక్స్ఛేంజ్ సంస్థకు భారీగా జరీమానా విధించింది యూఏఈ సెంట్రల్ బ్యాంక్. మొత్తం 496,000 దిర్హాముల జరీమానా సదరు సంస్థ ఎదుర్కోనుంది. సదరు సంస్థ నిబంధనల్ని ఉల్లంఘించిన దరిమిలా జరీమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 18న ఈ జరీమానా విధించారు. అయితే, ఆ సంస్థ పేరు మాత్రం వెల్లడి కాలేదు. ఎక్స్ఛేంజ్ కార్యాలయాలపై ఎప్పటికప్పుడు నిఘా వుంటుందనీ, అక్రమాలు జరిగినట్లు తేలితే చర్యలు కఠినంగా వుంటాయని యూఏఈ సెంట్రల్ బ్యాంక్ వర్గాలు స్పష్టం చేశాయి. సెంట్రల్ బ్యాంక్ గతంలో రెండు సార్లు పలు సంస్థలకు ఇలాగే జరీమానాలు విధించడం జరిగింది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు