భయపెడుతున్న ఫోటో..అయితే విషయమేమిటంటే..

- April 22, 2021 , by Maagulf
భయపెడుతున్న ఫోటో..అయితే విషయమేమిటంటే..

భారత్: దేశంలో సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉంది. రోజుకి లక్షల్లో కేసులు నమోదవుతూ కొత్త రికార్డ్స్‌ ని క్రియేట్‌ చేస్తోంది. ఇలాంటి టైమ్‌ లో కొద్దిరోజుల క్రితం ఓ ఫో టో అటు మీడియాని ఇటు సోషల్‌ మీడియాని షేక్‌ చేసింది. అదే ఈ పెద్దావిడ ఫోటో.

ఆక్సిజన్‌ సిలిండర్‌ తో రోడ్డుపై దీనంగా ఉన్న ఈ ఫోటోని చూపించి కొందరు భారత్‌ లోని సెకండ్‌ వేవ్‌ దుస్థితిపై తీవ్ర విమర్శలు చేశారు. పాలకులు, అధికారులు ఏం చేస్తున్నారంటూ మీడియాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదన్న నిజాన్ని కొందరు బయటపెట్టారు.

2018లో ఉత్తరప్రదేశ్‌ ఆగ్రాలో జరిగిన ఘటనకు సంబంధించిన ఫోటో అంటూ ఆ వార్త వివరాలను కూడా తెలిపారు. ఆక్సిజన్‌ సిలిండర్‌ ద్వారా ఆ తల్లి శ్వాస తీసుకుంటుంటే దాన్ని భుజాలపై కొడుకు ఎత్తుకున్న దృశ్యాలు సంచలనమయ్యాయి.  అంబులెన్స్ కోసం ఎదురుచూస్తూ ఆ తల్లీకొడుకులు రోడ్డుపక్కనే అలా కూర్చుండిపోయారు. అప్పట్లోనే మీడియాలో ఈ దృశ్యాలు ప్రసారం కావడంతో అధికారులు చర్యలు కూడా తీసుకున్నారు.

ఆ ఫోటోలను ఎవరో ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా మార్చుకొని ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేశారు. కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దని టెక్‌ నిపుణులు కూడా సలహా ఇస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com