భయపెడుతున్న ఫోటో..అయితే విషయమేమిటంటే..
- April 22, 2021భారత్: దేశంలో సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. రోజుకి లక్షల్లో కేసులు నమోదవుతూ కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తోంది. ఇలాంటి టైమ్ లో కొద్దిరోజుల క్రితం ఓ ఫో టో అటు మీడియాని ఇటు సోషల్ మీడియాని షేక్ చేసింది. అదే ఈ పెద్దావిడ ఫోటో.
ఆక్సిజన్ సిలిండర్ తో రోడ్డుపై దీనంగా ఉన్న ఈ ఫోటోని చూపించి కొందరు భారత్ లోని సెకండ్ వేవ్ దుస్థితిపై తీవ్ర విమర్శలు చేశారు. పాలకులు, అధికారులు ఏం చేస్తున్నారంటూ మీడియాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదన్న నిజాన్ని కొందరు బయటపెట్టారు.
2018లో ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో జరిగిన ఘటనకు సంబంధించిన ఫోటో అంటూ ఆ వార్త వివరాలను కూడా తెలిపారు. ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ఆ తల్లి శ్వాస తీసుకుంటుంటే దాన్ని భుజాలపై కొడుకు ఎత్తుకున్న దృశ్యాలు సంచలనమయ్యాయి. అంబులెన్స్ కోసం ఎదురుచూస్తూ ఆ తల్లీకొడుకులు రోడ్డుపక్కనే అలా కూర్చుండిపోయారు. అప్పట్లోనే మీడియాలో ఈ దృశ్యాలు ప్రసారం కావడంతో అధికారులు చర్యలు కూడా తీసుకున్నారు.
ఆ ఫోటోలను ఎవరో ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా మార్చుకొని ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేశారు. కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దని టెక్ నిపుణులు కూడా సలహా ఇస్తున్నారు.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి