ఇండియా టు యూఏఈ: ప్రయాణం నిషిద్ధం!!
- April 22, 2021దుబాయ్: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ కొరడా విసురుతోంది. రోజురోజుకీ పరిస్థితి చేతులు దాటిపోతోంది. ఈ తరుణంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణీకులపై తాత్కాలిక నిషేధం విధించింది యూఏఈ. ఈ నిర్ణయం ఏప్రిల్ 25 ఆదివారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ప్రయాణ నిషేధం ఏప్రిల్ 24 శనివారం రాత్రి 11.59 నుండి అమల్లోకి వస్తుంది. 10 రోజుల తర్వాత జరిగే తదుపరి సమీక్ష లో నిషేధం పై నిర్ణయం తీసుకోనుంది కాబినెట్.
అలాగే, గడిచిన 14 రోజులలో భారతదేశం గుండా ప్రయాణించిన ట్రాన్సిట్ ప్రయాణీకులు కూడా యూఏఈ ప్రవేశానికి అనర్హులు.
యూఏఈ పౌరులు, దౌత్య పాస్పోర్ట్ హోల్డర్లు మరియు అధికారిక ప్రతినిధుల పై ఈ నిషేధం వర్తించదు అని ప్రభుత్వం తెలిపింది.
అయితే, యూఏఈ నుండి భారత్ కు మాత్రం విమానాలు కొనసాగుతూనే ఉంటాయి.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక